హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ రోజు రోజుకు తన మార్కెట్ను విస్తరించుకుంటున్నది. గతేడాది ప్రారంభించిన విజయ బ్రాండ్ ఐస్క్రీం (Vijaya ice cream) ఉత్పత్తులను విస్తృతం చేస్తూ ప్రైవేటు రంగానికి దీటుగా దూసుకుపోతున్నది. ఇందులో భాగంగా నగరంలోని దుర్గం చెరువు మెట్రో స్టేషన్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన విజయ డెయిరీ ఐస్క్రీం పార్లర్ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఐస్క్రీం పుష్ కార్డ్ను ఆరంభించనున్నారు.
ఇప్పటివరకు పాలు, పాల సంబంధిత ఉత్పత్తులకే పరిమితమైన విజయ డెయిరీ.. తృణధాన్యాల లడ్డూలు, చిక్కీలు, చాక్లెట్లు, బూందీ ఇతర మిక్చర్లు, ఐస్క్రీం తవంటి 50 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. విజయ బ్రాండ్లో 17 రకాల ఐస్క్రీం ఉత్పత్తులను తయారు చేస్తున్నది. దూద్పేడా, మిల్క్కేక్, నెయ్యి మైసూర్పాక్కు మంచి గిరాకీ ఉన్నది.