మహబూబ్నగర్ : జిల్లాలో తెలంగాణ తిరుపతిగా సుప్రసిద్ధమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన్యంకొండలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు మహర్దశ పట్టిందన్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఆలయ చైర్మన్ మధుసూదన్, సుబ్బయ్య, లోకయ్య, వేణు, ఆంజనేయులు, చేరుకుపల్లి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.