అహ్మదాబాద్ : మొబైల్ ఫోన్స్లో సులభంగా అశ్లీల వీడియోలు అందుబాటులో ఉండటంతో భారత్లో లైంగిక దాడులు జరగడానికి కారణమన్నారు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి. ఇక బాలికలపై పొరుగున ఉండే వ్యక్తులు, కుటుంబ సభ్యుల వంటి తెలిసిన వ్యక్తులే దారుణాలకు తెగబడుతున్నారని అన్నారు.
భారత్లో లైంగిక దాడులకు ప్రధానంగా మొబైల్ ఫోన్లలో విచ్చలవిడిగా అశ్లీల వీడియోలు లభ్యమవడం, తెలిసిన వ్యక్తులే ఇలాంటి దాడులకు పూనుకోవడం ప్రధాన కారణాలని తాజా సర్వేలో వెల్లడైందని మంత్రి పేర్కొన్నారు. లైంగిక దాడి ఘటనలకు ఎప్పుడూ పోలీసులను నిందిస్తుంటారని అన్నారు.
అయితే ఇలాంటి ఘటనలకు మనం కేవలం పోలీసులనే నిందించలేమని అన్నారు. తండ్రి తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడితే అది సామాజిక అంశం కాదా అని ప్రశ్నించారు. తండ్రి తన కూతురిపై అత్యాచారం చేస్తే అందుకు అతడి మొబైల్ ఫోన్ కారణమని మంత్రి పేర్కొన్నారు.