హైదరాబాద్, జనవరి 31 : ప్రైవేట్ స్కూళ్లలోని ఎస్సెస్సీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి సూచించారు. సిలబస్ను త్వరగా ముగించి, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) నేతలను కోరారు. బడులను పునఃప్రారంభించి, ప్రత్యక్ష తరగతులకు అవకాశం కల్పించినందుకు ట్రస్మా నేతలు సోమవారం హైదరాబాద్లో మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్, ప్రతినిధులు ఉమామహేశ్వర్రావు, శివరాత్రి యాదగిరి, కృష్ణప్రసాద్, రఘు, పవన్, అల్తాఫ్ హుస్సేన్, సోమశేఖర్, శివరామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.