హైదరాబాద్ : చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు వినూత్నంగా భోదిస్తు చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabhita Indrareddy) అన్నారు. మహేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచ్ లతో విద్యా శాఖ ఉన్నతాధికారులు, చదువులో వెనుకబడ్డ వారికి ఎన్జీవోల సహకారం, స్థానికంగా చదువుకున్న యువత సహకారంతో చేపట్టనున్న కార్యక్రమంపై బుధవారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాలతో విద్యా శాఖలో మార్పులు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 5వ తరగతి వరకు చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు విన్నూతంగా భోదిస్తూ చేపట్టిన తొలిమెట్టు విజయవంతం అయిందన్నారు. కరోనా సమయం(Corona period)లో విద్యకు దూరమైన పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగేలా నూతన బోధన పద్ధతులతో తొలిమెట్టును నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
అందులో భాగంగా ఆయా గ్రామాల్లో చదువులో వెనుకబడిన వారిని స్థానిక సర్పంచ్లు,ఎంపీటీసీలతో ప్రత్యేకంగా గుర్తించి ఆ గ్రామంలోనే చదువుకున్న యువతలో నుంచి ఎన్జీవోల సహకారం(NGO’s coperation)తో వాలంటీర్లను నియమించి ప్రత్యేకంగా తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలిమెట్టు(Tolimettu)ను రాష్ట్రంలో మోడల్ గా మహేశ్వరం లో చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు.
రంగారెడ్డి జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, హైదరాబాద్,మేడ్చల్ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ,అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ,జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి , ఎంపీపీ రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా అంధ్యానాయక్, విద్యా శాఖ అధికారులు, ఎన్జీవో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
,