హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సెక్రటేరియట్లో కొత్త మసీదు నిర్మాణంపై ఎంఐఎం సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సెక్రటేరియట్లో పాత మసీదు స్థానంలో కొత్త మసీదు కడుతామని ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. గతంలో 433 గజాల్లో మసీదు ఉండే.. దాన్ని ప్రస్తుతం 1500 గజాల స్థలంలో నిర్మిస్తామన్నారు. టెంపుల్కు 1500 గజాలు, చర్చికి 500 గజాలు కేటాయించామన్నారు.
ఈ మూడింటింకి ఒకేసారి శంకుస్థాపన చేస్తామన్నారు. సెక్రటేరియట్ బిల్డింగ్ పూర్తికాకముందే.. వీటిని నిర్మించి అందుబాటులోకి తెస్తామన్నారు. మసీదు విషయంలో మరోసారి సమావేశమై ప్లాన్పై నిర్ణయం తీసుకుంటాం, రంజాన్ కంటే ముందే నిర్మాణం చేపడుతాం అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.