హైదరాబాద్: మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజా పాలన చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బకాయిలను వీలైనంత తొందరగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేదర్ విగ్రహం వద్ద 80 నూతన బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ, ప్రయాణికులకు సౌకర్యానికి పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ఓఆర్ వంద శాతానికి చేరుకుందని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యాలపై సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించామని వెల్లడించారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటున్నాని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కీలక పాత్రపోషించిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కీలక పాత్రపోషించిందన్నారు. ఆర్టీసీ సిబ్బంది, బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బస్సులు ఓవర్లోడ్ అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి ఆలోచిస్తున్నామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి 20 రోజుల్లో రోజుకు 30 లక్షల మంది ఉచిత ప్రయాణం చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. తర్వలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని, వాటిలో 500 హైదరాబాద్కు, మరో 500 బస్సులను జిల్లాలకు కేటాయించామన్నారు.