హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
మలబార్ జెమ్స్ ఈ కంపెనీ ద్వారా రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2,750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇప్పటికే తెలంగాణలో 17 రిటైల్ షోరూమ్స్ను ప్రారంభించింది. వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించింది. ఈ షోరూమ్స్ను విస్తరించేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మలబార్ జెమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, పరిశ్రమల డైరెక్టర్ డీ కృష్ణ భాస్కర్, మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అహ్మద్ ఎంపీ, వైస్ చైర్మన్ అబ్దుల్ సలాం కేపీ పాల్గొన్నారు.
Investments continue to pour into #Telangana!
Minister @KTRTRS laid the foundation stone for Malabar Gems & Jewellery @Malabartweets manufacturing facility located in Maheshwaram, Rangareddy District. It would be set up with an investment of ₹750 crore. @InvTelangana pic.twitter.com/T3jnRf3mvg
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 15, 2022