నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఈ నెల 10వ తేదీన మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించనున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మిర్యాలగూడలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో వివిధ శాఖల అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపైన సమీక్షించారు. మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీఎస్పీ వెంకటగిరి, ఆర్డీవో చెన్నయ్య, వివిధ శాఖల అధికారులకు పాల్గొన్నారు.