హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం(Ambedkar Statue) తెలంగాణకు మణిహారంగా నిలువనుందని ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు. విగ్రహం ఆవిష్కరణలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన కోరారు. బుధవారం ఆయన విగ్రహ నిర్మాణం పనులను పరిశీలించారు.
రాక్ గార్డెన్(Rock Garden), ల్యాండ్ స్కేపింగ్(Land scaping), ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెన్, సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమావేశమై పనుల పురోగతిపై చర్చించారు.
125 అడుగుల ఎత్తుతో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా నిలుస్తుందని చెప్పారు.విగ్రహం నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేశారు.అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 న విగ్రహాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నిర్ణయించారని, ఈ మేరపకు ఏప్రిల్ 10 తేదీ కల్లా నిర్మాణ పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంతో సిబ్బంది పనిచేస్తున్నాని వెల్లడించారు.