సూర్యాపేట : పదేళ్లకాలంలో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి(Minister Jagdishreddy) అన్నారు. అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలని, కాంగ్రెస్కు ఓటేస్తే సంక్షోభాలను ఎదుర్కొనవలసి ఉంటుందని పేర్కొన్నారు.
సూర్యాపేట నియోజకవర్గంపెన్ పహాడ్ మండలం అనంతారం, అన్నారం , అన్నారం బ్రిడ్జి, నారాయణగూడెం, నాగుల పహాడ్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. రాబోయే ఎన్నికలు(Elections) ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు.
రైతుబంధు(Raitu Bandu), రైతు బీమా, 24 గంటల కరెంటు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని ఉద్ఘాటించారు. మూసి సాగర్ ఆయకట్టు కింద వరుసగా 18 పంటలకు సాగు నీరు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్(BRS) దేనని వెల్లడించారు. నల్లగొండ కాంగ్రెస్ నాయకుల చేతగాని తనం వల్లే వరుసగా ఏడు ఏళ్లు ఎడమకాలువ ఎండిపోయింది గుర్తు చేశారు.
తెలంగాణలో ఎకరం అమ్ముకొని ఆంధ్రలో 100 ఎకరాలు కొనే రోజులు వచ్చాయని అన్నారు. బీఆర్ఎస్ను మరోసారి గెలిపిస్తే తెల్ల రేషన్ కార్డ్ ఉన్న 93 లక్షల కుటుంబాలకు ఐదు లక్షల బీమా సదుపాయం, అన్నపూర్ణ పథకం కింద అందరికీ సన్న బియ్యం, దశలవారీగా ఆసరా పెన్షన్ దశల వారీగా పెంపుదల, దివ్యాంగులకు రూ. 6వేలు, రైతుబంధు రూ.16,000 తదితర పథకాలు అందిస్తామని అన్నారు. ప్రచారం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వందలాదిమంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.