సాగర్లో జానారెడ్డి చేసింది శూన్యం
ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి
పెద్దవూర, ఏప్రిల్ 5: గత 60 ఏండ్లలో పాలనలో తెలంగాణ ఆగమైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నా రు. ఎన్నో ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించిన టీఆర్ఎస్ పార్టీ చరిత్రను ఎవరూ మరువలేరని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, అభ్యర్థి నోముల భగత్తో కలి సి సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. సమైక్య పాలనలో గ్రామాల్లో తాగు, సాగునీరు దొరక్క ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రైతులు పంటలు నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల విద్యుత్తుతో వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో త్వరలోనే రూ.11 వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. 35 ఏండ్ల పాలనలో డిగ్రీ కాలేజీ మంజూరు చేయించలేని అసమర్థుడు జానారెడ్డి అని విమర్శించారు. నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే నోముల భగత్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.
ప్రజలను ఓటు బ్యాంకుగా చూసిన కాంగ్రెస్ : బాల్క సుమన్
ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా పరిపాలన చేసిన కాంగ్రెస్ నా యకులు ప్రజలను ఓటేసే యంత్రాలుగానే చూశారని ప్రభు త్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. ఏడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచి ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన జానారెడ్డి.. గ్రా మాలకు వెళ్లి చూస్తే ఆయన చేసిన పనితనం కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. వయస్సులో ఉన్నప్పుడే అభివృద్ధి చేయలేని జానారెడ్డి.. 77 ఏండ్ల వయస్సులో ఢిల్లీలో, గల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలేని సమయంలో ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ కపట ప్రేమకు మోసపోవద్దని, తల్లి లాం టి టీఆర్ఎస్తోనే ప్రజలకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నోముల భగత్ విజయం ఖాయం: ఎమ్మెల్సీ పోచంపల్లి
టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ విజయం ఖాయమైందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ఓటమి తప్పదన్నారు. 70ఏండ్లలో జరుగని అభివృద్ధిని మండలంలో రెండేండ్లలోనే దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చేశారన్నారు. త్రిపురారం నుంచి జిల్లా కేంద్రానికి రూ.2.63 కోట్లతో రోడ్డు వేయించారని తెలిపారు.
గెలుపు టీఆర్ఎస్దే : మంత్రి మహమూద్ అలీ
హాలియా, ఏప్రిల్ 5: సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నూటికి నూరు శాతం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలిచి తీరుతారని హోంమంత్రి మహమూద్ అలీ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన హాలియాలో మీడియాతోపాటు మారేపల్లిలో నిర్వహించిన మైనార్టీల సమావేశంలో మాట్లాడారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పా రు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు.. గల్లీలో లేదని, భవిష్యత్తులోనూ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. సాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి వాహనం తనిఖీ
నల్లగొండ సిటీ, ఏప్రిల్ 5 : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అన్ని వాహనాలను క్షుణ్ణం గా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గ్గొనేందుకు వెళ్తున్న మంత్రి జగదీశ్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వాహనాలను అనుముల మం డలం పులిమామిడి చెక్పోస్టు వద్ద, త్రిపురారం చెక్పోస్టు వద్ద ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు వాహనాలను తనిఖీ చేశారు.
కుల వృత్తులను నిలబెట్టింది టీఆర్ఎస్సే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
త్రిపురారం, ఏప్రిల్ 5: కుల వృత్తుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. సోమవారం మంత్రి తలసాని త్రిపురారంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి గడప గడపకూ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా వృద్ధులు, వితంతువులను ఆప్యాయంగా పలుకరించారు. ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భగత్ను గెలిపించాలని మంత్రి తలసాని కోరారు.