హైదరాబాద్ : గురువారం ఉదయం రాష్ట్ర శాసనమండలి శాసనసభ్యుల కోటాలో శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు అందజేశారు.
మంత్రి వెంట నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మిర్యాలగూడెం ఎమ్మెల్యే యన్.భాస్కర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు ఉన్నారు.