హైదరాబాద్ : నగరంలోని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ను ప్రముఖ సినీ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్తో కలిసి మంత్రి హరీశ్రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 450 పడకలున్న ఆసుపత్రిలో కొత్తగా.. మరో 300 పడకలతో మరో బిల్డింగ్ కడుతున్నామన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు బెడ్స్ సంఖ్యను పెంచుతున్నామన్నారు. వచ్చే నెల 15న బిల్డింగ్ పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అమెరికాలో డాక్టర్ అద్దంకి శరత్.. మూడేళ్లపాటు 300 బెడ్స్కు శానిటేషన్, హౌస్ కీపింగ్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు, వారి నిర్వహణ ఉచితంగా చేస్తానని చెప్పారని, ఒక పైసా కూడా తీసుకోనని తెలిపారన్నారు.
నెల నెలా జీతాలు.. అన్నీ మేమే చూసుకుంటామన్నారు. ఎంపీ విజయేంద్ర ప్రసాద్ సైతం హాస్పిటల్ను విజిట్ చేశారన్నారు. ఎంఎన్జేలో రీసెంట్గా మాడ్యులర్ థియేటర్ను ప్రారంభించామని, రోబోటిక్ థియేటర్ కోసం టెండర్ పిలుస్తామన్నారు. వైద్యుల కొరత ఉందని, 100 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పేషెంట్ డైట్ క్వాలిటీ విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నామని, రేపు అధికారులు జాయింట్ ఇస్పెక్షన్ చేస్తారని, అక్టోబర్ 15న కొత్త బిల్డింగ్ ప్రారంభిస్తామన్నారు. ఇబ్రహీంపట్నం ఘటనకు సంబంధించి రిపోర్ట్ వచ్చిందని, రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని వివరించారు.