వరంగల్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలో గల కో ఆపరేటివ్ భవనంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంను సందర్శించి పరిశీలించారు. మహిళలతో మాట్లాడారు.
శిక్షణ జరుగుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అలాగే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని, పాత కోర్టు సమీపంలో గల ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, మహిళా భవనంలో గల ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
తొర్రూరు మండల కేంద్రంలో ఆర్ అండ్బీ గెస్ట్ హౌస్లో తొర్రూరు మండలం డ్రైవింగ్ లైసెన్స్లను పంపిణీ చేశారు. అనంతరం హరిపిరాలలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మహిళలు పాల్గొన్నారు.