ఖమ్మం, సెప్టెంబర్ 22: పూలను పూజించ పండుగ మనదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని అన్నారు. పండుగ పూట సంతోషంగా ఉండేందుకే ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం చీరెలను సారెగా అందిస్తోందని, ఇది ఎతో గర్వకారణమని అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి అజయ్కుమార్ ఖమ్మంలో గురువారం ప్రారంభించారు.
నగరంలోని శాంతినగర ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, నయాబజార్ కళాశాల గ్రౌండ్, గట్టయ్య సెంటర్ ఫ్రీడమ్ పార్క్ లలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి నిర్వహించే బతుకమ్మ వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఉమ్మడి పాలనలో బతుకమ్మ పండుగను హేళనగా చూసేవారని, ఇప్పుడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మను గౌరవించుకున్నామని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి బతుకమ్మ చీరెలను తయారు చేయించారన్నారు.
మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కలెక్టర్ గౌతమ్, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్కుమార్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ రాధికా గుఫ్తా, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, కమర్తపు మురళి, మక్బుల్, గజ్జెల లక్ష్మి, శ్రీవిద్య, ప్రశాంతలక్ష్మి, నిరీశారెడ్డి, అమృతమ్మ, మడూరి ప్రసాద్, మాటేటి అరుణ నాగేశ్వరరావు, తోట గోవిందమ్మ రామారావు, పసుమర్తి రామ్మోహన్రావు, మాటేటి కిరణ్కుమార్ పాల్గొన్నారు.