మెదక రూరల్, మార్చి 22 : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రభుత్వం అమలు చేసి, పేదింటి ఆడపడుచులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఖాజీపల్లి, వెంకటాపూర్, కొంటూరు, గుట్టకిందిపల్లి, మక్తభూపతిపూర్, మాల్యాపూర్, శివ్యాయిపల్లి, రాయిన్పల్లి, పాతూరు, తిమ్మానగర్ గ్రామా ల్లో 22 మంది లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పక్షపతి అన్నారు. గతంలో ఆడపిల్ల పెండ్లి చేయాలంటే తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఆడపిల్లల పెండ్లిళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మితో పేదింట్లో కల్యాణ కాం తులు విరజిమ్ముతున్నాయన్నారు. మెదక్ నియోజకవర్గంలోని 3 వేల మంది లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి రూ. 3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.
సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే
ఖాజిపల్లి బస్స్టాప్ వద్ద తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సర్పంచ్, గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, స్పందించి ఫోన్లో ఆర్అండ్బీ ఈఈ శ్యామ్సుందర్తో మాట్లాడారు. ప్రమాదాల నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు.
తిమ్మానగర్ ప్రాథమిక పాఠశాల తనిఖీ
తిమ్మానగర్ పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యకమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, ఎంపీపీ యమునాజయరాంరెడ్డి, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్రెడ్డి, ఎంపీటీసీ ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజాగౌడ్, సర్పంచ్లు స్వప్నా సిద్ధిరాములు, రాజ్యలక్ష్మీరవిందర్, సుంకరి నర్సింహులు, సరోజామోహన్, లక్ష్మీఆంజనేయులు, మాధవీరవీందర్, గంజి ప్రభాకర్, ఎంపీడీవో శ్రీరాములు, తహసీల్దార్ శ్రీనివాస్, రూరల్ ఎస్సై మోహన్రెడ్డి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కిష్టయ్య,టీఆర్ఎస్ నాయకులు జయరాంరెడ్డి, సిద్ధి రాములు యాదవ్, వెంకట్, నాగారాజు, ఆంజనేయులు, ఉప సర్పంచ్లు వార్డుసభ్యులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
హవేళీఘనపూర్, మార్చి 22 : పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు సీఎం కేసీఆర్ అండగా ఉంటూ వారిని అన్నివిధాలా ఆదుకుంటున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్త కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. రాజ్పేటలో ఎల్లమ్మ, పెద్ద మ్మ దేవాలయాల వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్పేట టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి చాకలి రమేశ్ మరణించగా, అయన భార్య లక్ష్మికి చెక్కును అందజేశారు. వాడిలో టీఆర్ఎస్ కార్యకర్త రాజయ్య భార్య భూదెమ్మకు రూ.2లక్షలు, జక్కన్నపేటలో బోయిని సత్యనారాయణ కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే వెంట జడ్పీవైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, సొసైటీ చైర్మన్ హన్మంత్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, వైస్ ఎంపీపీ రాధాకిషయాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు సతీశ్రావు, మాజీ ఎంపీపీ కిష్టయ్య, సర్పంచ్లు యా మిరెడ్డి, సాయాగౌడ్, ఎంపీటీసీలు సిద్దిరెడ్డి, రాజ్పేట ఎంపీటీసీ దుర్గారావు, నారాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.