ప్రముఖ జర్నలిస్ట్, నటుడు తుమ్మల నరసింహ రెడ్డి( టీఎన్ఆర్) ఇటీవల కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. టీఎన్ఆర్ అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. టీఎన్ఆర్ కుటుంబానికి తాను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పిన చిరంజీవి తక్షణ సాయంగా లక్ష రూపాయలను టి ఎన్ ఆర్ భార్య జ్యోతికి పంపారు. సంపూర్ణేష్ బాబు కూడా 50 వేల రూపాయలు ఆర్థికసాయం చేశారు.
తాజాగా దర్శకుడు మారుతి తన వంతుగా 50 వేల రూపాయల సాయాన్ని అందించారు. టీఎన్ఆర్ భార్య జ్యోతి బ్యాంక్ అకౌంట్కు మనీ పంపిన మారుతి.. ప్రతి ఒక్కరు తమకు తోచినంత సాయం వారికి చేయాలని సూచించారు. కాగా, మారుతి ప్రస్తుతం యాక్షన్ హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్కు కరోనా బ్రేక్ వేసింది.