సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వేడుకలు దగ్గరకొస్తున్న నేపథ్యంలో ఎక్కువ ధరకు గంజాయి అమ్మేందుకు ఇదే సమయమని భావించి..స్మగ్లింగ్కు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెం ట్ బృందం అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి 13 కిలోల సరుకును స్వాధీనం చేసుకుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్స్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎన్. అంజిరెడ్డి కథనం ప్రకారం… ఒడిశాకు చెందిన దీన బంధు బాష కొండాపూర్లో ఉంటూ.. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. హన్మకొండకు చెందిన నీలం అకాశ్ రాజ్ అయ్యప్ప సొసైటీలో నివాసముంటూ.. చదువుకుంటున్నాడు.
గచ్చిబౌలిలో ఉండే మధ్యప్రదేశ్కు చెందిన ప్రహ్లాద్ గుప్తా హోటల్ వ్యాపారం చేస్తుంటే..వంట మనిషిగా పనిచేసే ఒడిశాకు చెందిన రితిక్ పధియర్ జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు. భువనేశ్వర్కు చెందిన రాజు రూ. 5 వేలకు కిలో చొప్పున 15 కిలోల గంజాయి తెచ్చి..రిత్విక్ పధియర్కు అప్పగించాడు. రిత్విక్ తన స్నేహితుడు దీన బంధు దాస్తో కలిసి ఆ గంజాయిని మాదాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో రూ. 10 వేల చొప్పున విక్రయించాలని ప్లాన్ వేశాడు.
హఫీజ్పేట్కు చెందిన విక్రయదారుడు మహముదాకు 2 కిలోల గంజాయిని అమ్మాడు. కాగా, జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం రూట్ వాచ్ చేస్తుండగా, గంజాయి పంచుతూ.. రిత్విక్, దీన బంద్, ప్రహ్లాద్, ఆకాశ్రాజ్లు పట్టుబడ్డారు. మహముదా, రాజులు పరారీలో ఉన్నారు. జాయింట్ కమిషనర్ అజయ్రావు నేతృత్వంలో సూపరింటెం డెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యం లో సీఐ రవి, ఎస్సైలు నిజాముద్దీన్, దామోదర్ తదితర సిబ్బంది ఈ ముఠాను అరెస్ట్ చేశారు.