Weather changes | న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఏకకాలంలో వర్షపాతం, వేడి తీవ్రతలు రాబోయే కాలంలో మరింత తరచుగా, తీవ్రంగా, విస్తృతంగా మారుతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. పొడి-వేడి పరిస్థితుల కంటే వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఉష్ణోగ్రతలో ప్రతి 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదలకు తేమను పట్టి ఉంచే గాలి సామర్థ్యం 6-7 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. వేడి, తేమతో కూడిన గాలి.. ఎక్కువ వర్షంగా పడేలా చేస్తుందని, తద్వారా తేమ-వేడి పరిస్థితులు ఉంటాయని తెలిపారు. అధ్యయన వివరాలు ‘ఎర్త్స్ ఫ్యూచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.