రంగారెడ్డి : ఓపియం సాగుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.20 లక్షల విలువైన ఓపియంను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. సమాచారం తెలిసిన పోలీసులు నిషేధిత ఓపియం సాగుచేస్తున్న పంట పొలాన్ని గుర్తించారు. డి. చెన్నకేశవులు(45) అనే వ్యక్తి డి. వెంకటరమణ అలియాస్ నాగరాజు(43)తో కలిసి ఓపియం సాగు చేస్తున్నాడు. పండించిన ఓపియంను హైదరాబాద్, బెంగళూరు, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అమ్ముతున్నారు. సంఘటనా స్థలం నుంచి 400 కిలోల బరువున్న 20 ఓపియం సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నిందితులపై కేసు నమోదు చేశారు. నాగరాజును చిత్తూరు జిల్లా మధనపల్లెకు చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ బ్యూరో మార్చి 16నే అరెస్టు చేసింది.