చెన్నై, మే 6: ఓ వ్యక్తి కడుపులో రూ.1.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తమిళనాడులోని విరుగంబక్కం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల రంజాన్ పండుగను జరుపుకోవడానికి ఓ మహిళ తన మిత్రుడు, అతడి భార్యను ఇంటికి ఆహ్వానించారు.
బిర్యానీని వడ్డించి వంటగదిలోకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన అతడు అక్కడే ఉన్న బంగారు నెక్లెస్, గొలుసు, ఇతర ఆభరణాలను బిర్యానీలో కలుపుకొని తిన్నా డు. వంటగది నుంచి వచ్చిన సదరు మహిళ ఆభరణాలు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దవాఖానకు తీసుకెళ్లి పరిశీలించగా కడుపులో ఆభరణాలు కనిపించాయి. డాక్టర్లు శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు.