తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్(Tandur) మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పెద్దింటి ప్రభాకర్(64) అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. అతిగా మద్యం ( Alcohol ) తాగడానికి అలవాటు పడ్డ ప్రభాకర్ను కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై గురువారం స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య రాజేశ్వరి తో పాటు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.