రాజన్న సిరిసిల్ల : మిడ్ మానేరు డ్యాంలో దూకి ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సారంపల్లి రాజు(37)గా గుర్తించారు. ఆత్మహత్యకు స్పష్టమైన కారణం తెలియనప్పటికీ ఆర్థిక సమస్యలే అయి ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు గ్రామంలో హెయిర్ సెలూన్ను నడుపుతున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. స్థానికులు రాజు బైక్ను, చెప్పులను కొదురుపాక బ్రిడ్జి వద్ద గుర్తించారు.
విషయాన్ని కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సహాయంతో నీళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని కనుగొని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.