ముంబై : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఆయా మోడళ్లపై రూ.80,000 కంటే ఎక్కువ రాయితీలను అందిస్తోంది. ఫిబ్రవరి నెలలో మహీంద్రా SUVని కొనుగోలు చేస్తే అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. మహీంద్రా Alturas G4 SUV పై దాదాపు రూ.81,5000 ప్రయోజనాలను అందించనున్నారు.
మహీంద్రా ఆల్టురాస్ G4 ఎక్స్ఛేంజ్ బోనస్తో దాదాపు రూ. 50,000 తగ్గింపుతో పాటు అదనంగా రూ. 31,500ల మేర బెనిఫిట్స్ పొందే అవకాశం ఉన్నది. SUV XUV300 మోడల్ లో దాదాపు రూ.69వేల ప్రయోజనాలు అందించనున్నారు. అయితే మహీంద్రా XUV700, థార్ , బొలెరో నియో SUVల వంటి మోడల్స్ కు ఈ రాయితీలు వర్తించవు.