కొల్లాపూర్, జనవరి 18 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగవట్నం భక్తుల రాకతో పులకించింది. రెండో యాదాద్రిగా ఖ్యాతిగాంచిన కొల్లాపూర్ మండలం సింగవట్నం లక్ష్మీనరసింహస్వామి పు ణ్యక్షేత్రంలో ప్రతి ఏటా మకర సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడా ది 15 నుంచి ఉత్సవాలు ప్రారంభం కాగా.. ప్రధా న ఘట్టమైన రథోత్సవం(తేరు) మంగళవారం సా యంత్రం నిర్వహించారు. తెలంగాణ నుంచే కా కుండా ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. సోమవారం మధ్యా హ్నం నుంచే భక్తులు ప్రత్యేక వాహనాల్లో క్షేత్రాని కి చేరుకున్నారు. పక్కనే పుష్కరిణిలో భక్తులు స్నా నం ఆచరించగా.. మరికొందరు తలనీలాలు సమర్పించారు.
అంతకుముందు ఆలయ ప్రధాన అర్చకులు ఓరుగంటి సంపత్కుమార్ శర్మ నేతృత్వం లో పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణకుంభంతో స్వామిని పూజించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ట్రస్ట్ చైర్మన్ రాజా ఎస్వీవీకేబీ ఆదిత్య లక్ష్మారావు, తనయుడు రాంగోపాల్రావు బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛరణాల మధ్య పూజ లు చేశారు. మంగళవాయిద్యాల మధ్య స్వామి ఉ త్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో రథంపైకి చేర్చారు. తర్వాత రథాన్ని లాగేందుకు భక్తు లు పోటీపడ్డారు. భక్తుల హోరు మధ్య రథం కదిలింది. తూర్పు దిశలో ఉన్న రత్నగిరి కొండ దిగువన శమీ వృక్షం చుట్టూ రథాన్ని తిప్పి తర్వాత యథాస్థానానికి తీసుకొచ్చారు. ఈ వేడుకను తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు.
శ్రీవారి సముద్రం గట్టు పొడవునా.. లక్ష్మీదేవమ్మ గుట్ట భక్తులతో నిండిపోయింది. చెంచుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డ్రస్ కోడ్తో అచ్చంపేటకు చెందిన మహిళలు కోలాటాలు ఆడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీసుల రెండంచెల భద్రత చర్యలు చేపట్టారు. నాగర్కర్నూల్ డీఎస్పీ మోహన్రెడ్డి పర్యవేక్షణలో స్థానిక సీఐ వెంకట్రెడ్డి, ఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జాతరలో ఔట్ పోస్టును ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోలీసులు భద్రతను పర్యవేక్షించా రు. దర్శనానంతరం జాతర ప్రాంగణంలో తినుబండారాలు, నోరూరించే చెరుకు గడలను భక్తు లు కొనుగోలు చేశారు.
ఎమ్మెల్యే బీరం పూజలు..
సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవా ల సందర్భంగా మంగళవారం కొల్లాపూర్ ఎమ్మె ల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి క్షేత్రాన్ని సందర్శించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన సతీమణి బీరం విజయమ్మకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ల క్ష్మీనరసింహస్వామి కృపకు పాత్రులు కావాలని ఎ మ్మెల్యే కాంక్షించారు. రథోత్సవానికి మార్కెట్ క మిటీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, సర్పంచులు మాండ్ల కృష్ణయ్య, దశరథ్ నాయక్, ఉపసర్పంచ్ సత్యనారాయణ, సింగిల్విండో చైర్మన్లు శ్రీనివాసులు, కృష్ణయ్య, విండో వైస్ చైర్మన్ స్వామి, డైరెక్టర్ పరశురాంగౌడ్, నాయకులు చంద్రశేఖరాచారి, కిషన్నాయక్, కేశవులు, కిరణ్, సాయిరాం యాదవ్, వేణుగోపాల్ యాదవ్, రాఘవేంద్ర, సాంబశివుడు యాదవ్, దశరథం పాల్గొన్నారు.