హన్వాడ, జనవరి 18 : యాసంగిలో పండించిన ధా న్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చే యమని స్పష్టం చేయడంతో రైతులు ఇతర పంటలపై ఎ క్కువగా దృష్టి సారించారు. ప్రభుత్వ సూచనల మేరకు ఇత ర పంటల సాగు వైపు రైతుల దృష్టి సారించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించడం జరుగుతున్నది. ప్రతియేటా ఒకే పంట సాగు చేయడం వల్ల భూ సారం తగ్గి, పెట్టుబడి ఖర్చులు పెరిగి, పంట దిగుబడి తగ్గి రైతులు అప్పుల పాలు కావడం జరుగుతున్నది. వాటిని ని వారించేందుకు ప్రభుత్వం రైతులను ఆరుతడి పంటల సా గు వైపు మళ్లించేందుకు సిద్ధమైంది. రైతులకు అవగాహన కల్పించడంతోపాటు పంటలు వేసుకునేలా కృషి చేశారు.
మండలంలో డ్రిప్ సహాయంతో చాలా మంది రైతులు వా ణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వస్తుందని అవగాహన కల్పించడంతో రైతులు 115 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. అలాగే రెండు వే ల ఎకరాల్లో వేరుశనగ పంట, 400 ఎకరా ల్లో వివిధ రకాల కూరగాయలు, 300 ఎకరా ల్లో రాగి పంట సాగు చే శారు. ఈ సారి యాసంగిలో వరి సాగు చాలా తగ్గిపోయింది.
ప్రధానంగా రైతులు ఇతర పంటలతోపాటు కూరగాయల సాగుపై మొగ్గు చూపుతున్నా రు. అవగాహన క ల్పిం చడంతో చాలా మంది రైతులు వాణిజ్య పంట లు సాగు చేయడం జరిగిందని రైతులు పేర్కొంటున్నారు.
ఇతర పంటలు సాగు
వరి పంట సాగు చేయొద్దని గ్రామా ల్లో రైతులకు అవగాహన కల్పించడంతో ఇతర పంటలు ఎక్కువగా సాగు చేశారు. గతంలో సాగు వేసిన పంటలే వేయడంతో దిగుబడి రాక నానా ఇబ్బందులు పడేవారు. తక్కువ నీటితో ఎక్కువ సాగు చేస్తున్నారు. డ్రి ప్ సహాయంతో పంటలు సాగు చేయడంతో దిగుబడి ఎక్కువగా వస్తుంది. పంటలపై ఎలాంటి సమాచారం కావాలన్నా ఇవ్వడం జరుగుతున్నది. గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఏఈవోలు కూడా అందుబాటులో ఉంటారు.
-కిరణ్కుమార్, వ్యవసాయ శాఖ అధికారి హన్వాడ మండలం