గోవింద నామస్మరణతో కాంచనగుహ పులకించింది. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా
గురువారం నిర్వహించిన ఉద్దాలోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. చిన్నచింతకుంట మండలం
వడ్డెమాన్ గ్రామం నుంచి ఆలయం వరకు ఉద్దాలను ఊరేగించారు. వాటిని తాకేందుకు భక్తులు పోటీ పడి తన్మయత్వం పొందారు. సుమారు 2 లక్షల మంది భక్తులు రావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి బారులుదీరి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఉద్దాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె, ఎమ్మెల్యే ఆల, చిట్టెం, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, శాట్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ప్రజాప్రతినిధులు పూజలు చేశారు.
దేవరకద్ర రూరల్, నవంబర్ 11 : కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఊరేగింపు గురువారం వైభవంగా సాగింది. గోవింద నామస్మరణతో కొండలు మార్మోగాయి. దీంతో కాంచనగుహ పులకించింది. వివిధ జిల్లాతో పాటు, ఇతర రాష్ర్టాల నుంచి సుమారు 2 లక్షల వరకు భక్తులు తరలివచ్చారు. వాహనాలు, ఎడ్లబండ్లపై తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం గంటల తరబడి బారులు దీరారు. కురుమూర్తి రోడ్డు వద్ద క్యూలైన్ నుంచి గుట్టపైకి భారీ క్యూలైన్ కనిపించింది. భక్తి శ్రద్ధలతో కురుమూర్తి రాయుడికి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు నియమనిష్టలతో వంటలు వండి స్వామికి దాసంగాలు సమర్పించారు. అంతకుముందు చిన్నచింతకుంట మండలం చిన్న వడ్డెమాన్ వద్ద ఉద్దాలకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, నెల్లి వంశస్తులు మనోహర్రెడ్డితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పూజలు చేశారు. కొద్దిసేపు భక్తుల దర్శనం కోసం అక్కడే ఉంచారు. అనంతరం అక్కడి నుంచి ఉద్దాలను తీసుకెళ్తుండగా.. భక్తులు ఉద్దాలను తాకి భక్తిపారవశ్యానికి లోనయ్యారు. ట్రాక్టర్పై పెద్దవడ్డెమాన్, తిరుమలాపూర్ మీదు గా కురుమూర్తి ఆలయ సమీపంలో ఉన్న మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రదక్షిణలు చేసి ఉద్దాల మండపం వద్దకు తీసుకెళ్లారు. మంగళవాయిద్యాలు, భక్తుల భజనలు, శివసత్తుల పూనకాల మధ్య ఉత్సవం ముగిసింది. భక్తు లు తెల్లవారుజాము నుం చే భారీగా తరలొచ్చారు. అవాంఛనీయ ఘటన లు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమాల్లో ప్రత్యేకాధికారి శ్రీనివాస్, తాసిల్దార్ సువర్ణరాజు, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఈవో శ్రీనివాసులు, ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరిరాము, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.మంత్రి, ఎమ్మెల్యేల పూజలు కురుమూర్తి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఉద్దాలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, శాట్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి పూజలు చేశారు.