జడ్చర్ల రూరల్, నవంబర్ 9 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నసరుల్లాబాద్ గ్రామంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణీల్చందర్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రై తులు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. అదేవిధంగా కోడ్గల్ గ్రామంలో డబుల్బెడ్రూం ఇండ్ల వద్ద సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. రూ.15లక్షలతో సీసీరోడ్డు, రూ.4లక్షలతో డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచ్ రాంచంద్రయ్య, నవీన్రెడ్డి, ఇంతియాజ్ఖాన్, రఘపతిరెడ్డి, ఆంజనేయులు, యాదయ్యగౌడ్, డీఈ హీర్యానాయక్, ఏఈ బాబు తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
బాలానగర్, నవంబర్ 9 : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కమల అన్నారు. మండలకేంద్రంతోపాటు మోతీఘనపూర్, పెద్దరేవల్లి, చిన్నరేవల్లి, హేమాజీపూర్ గ్రా మాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రా మాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. రైతులు ధా న్యంలో నాణ్యత పాటించాలని సూచించా రు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, నవంబర్ 9 : మండలకేంద్రంతోపాటు, చక్రాపూర్ తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, తాసిల్దార్ మంజుల, బీ చంద్రశేఖర్, శైలజాప్రకాశ్రెడ్డి, భాస్కర్గౌడ్, శెట్టి శేఖర్, కొండ య్య, జమీర్, కృపాకర్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి, కలీం, ఆంజనేయులు, ఎం భీమయ్య, బాలన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.