పెద్దవంగర, మార్చి 30 : నర్సరీ మొక్కల సంరక్షణలో జాగ్ర త్తలు పాటించాలని ఎంపీవో కిన్నెర యాకయ్య సిబ్బందికి సూ చించారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లో పల్లెప్రకృతి వనం నిర్వహణ, నర్సరీ నిర్వహణ, కంపోస్టు యార్డు షెడ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. గ్రామాల్లో స్థానిక సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు పనుల్లో నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.