Bomb Attack | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తనకు సెక్యూరిటీ మనీ ఇచ్చేందుకు నిరాకరించిన కారణంగా.. ఓ ఇంటిపై బాంబులతో దాడి (Bomb Attack) చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు. ఈ ఘటన జబల్పూర్ (Jabalpur)లోని ఘమాపూర్ ప్రాంతం భారత్ కృషి సమాజ్ స్కూల్ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ ఠాకూర్ అనే వ్యక్తి ముందుగా ఆ ప్రాంతంలోని ఆలయాన్ని సందర్శించాడు. అక్కడ గుడి బయట నుంచే దేవుడికి దండం పెట్టుకున్నాడు. అనంతరం నేరుగా గుడి సమీపంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ తన వెంట తెచ్చుకున్న బాంబులను ఆ ఇంటిపై ఒకదాని తర్వాత ఒకటి విసిరాడు. ముందుగా ఓ బాంబు విసరగా అది విఫలమైంది. ఆ తర్వాత వేసిన బాంబుకు ఇల్లు మొత్తం ధ్వంసమై భారీ శబ్ధం వచ్చింది. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. బాంబు పేలుడుతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రాంత ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి చిరు దుకాణాదారులను వేధిస్తున్నట్లు నిందితుడిపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు స్థానికుల ఫిర్యాదు మేరకు ఘమాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Video: Madhya Pradesh Man Prays At Temple, Then Throws Bombs At House https://t.co/qmPDNlJmbH pic.twitter.com/RBKb4dsJCM
— NDTV (@ndtv) May 8, 2024
Also Read..
Maldives | భారత పర్యటనకు రానున్న మాల్దీవుల మంత్రి
Mumbai School | పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్పై వేటు