హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లైసెన్స్దారుల ఎంపికకోసం నిర్వహించిన లక్కీడ్రాలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 2,620 దుకాణాలకు గాను 45 దుకాణాలకు శనివారం లక్కీడ్రాను ఆయా జిల్లాల పరిధిలో నిలిపివేశారు. వీటిలోభూపాలపల్లి జిల్లాలో రెండు దుకాణాలపై కోర్టు కేసు ఉన్నందున డ్రా నిర్వహించలేదు. రాష్ట్రవ్యాప్తంగా మరో 43 దుకాణాలకు అతి తక్కువగా (కొన్నిచోట్ల ఐదులోపు )దరఖాస్తులు రావడంతో డ్రా నిలిపివేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. లక్కీడ్రా నిలిచిన వాటిలో నిర్మల్ జిల్లాలో ఏడు, వికారాబాద్లో ఆరు, ఇతర జిల్లాల్లో మిగిలిన దుకాణాలు ఉన్నట్టు తెలిపారు. ఆయా దుకాణాలకు అతితక్కువగా దరఖాస్తులు రావడానికి కారణాలేం టి.. స్థానికంగా రింగ్ అవడం లేదా ఇతరత్రా ఏమైనా జరిగాయా? అన్న విషయాలపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచిస్తూ ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారులకు కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలు జారీచేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక వచ్చిన తర్వాత ఈ దుకాణాలకు వారంరోజుల్లో మరోమారు లక్కీడ్రా నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. 2,575 మద్యం దుకాణాలకు లక్కీడ్రాలను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యం లో నిర్వహించారు.
ఒకే కుటుంబంలో ముగ్గురికి దుకాణాలు
కుత్భుల్లాపూర్ ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. కొంపల్లిలోని కేబీఆర్ ఫంక్షన్హాల్లో శనివా రం మద్యం టెండర్ల ప్రక్రియలో భాగంగా ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది దరఖాస్తులు రాగా, ఇందులో అత్త, కోడలు సంగీత, మరదలు మధుమిత లాటరీలో దుకాణాలను దక్కించుకున్నారు.
ఒకే ఇంట్లో ఇద్దరిని వరించిన అదృష్టం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు దరఖాస్తు చేశారు. సుమారు వెయ్యి మందికిపైగా దరఖాస్తు చేసి 35కు పైగా దుకాణాలను దక్కించుకున్నట్టు సమాచారం. భువనగిరి పట్టణంలో 7వ వార్డు కౌన్సిలర్ దిడ్డికాడి భగత్, ఆయన సోదరుడు దిడ్డికాడి నర్సింగ్రావు దక్కించుకున్నారు. భువనగిరి మండల వడాయిగూడేనికి చెం దిన తండ్రీ కొడుకులు ఉప్పలయ్య, తులసీదాస్ చెరో వైన్స్ రావడం విశేషం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి దుకాణానికి 118 దరఖాస్తులు రాగా అందులో ఏకైక మహిళా దరఖాస్తుదారు పేరు లాటరీలో వచ్చింది.