లక్నో : అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత విలువైన తిమింగలం ఉమ్మిని లక్నో పోలీసులు సీజ్ చేశారు. రూ 10 కోట్ల విలువైన తిమింగలం ఉమ్మిని స్వాధీనం చేసుకున్న పోలీసులు గోమటినగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతం నుంచి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ స్ధాయిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద తిమింగలం ఉమ్మి స్మగ్లింగ్ను నిషేధించారు.
అరెస్టయిన నిందితులను ఫిరోజ్, అవినాష్, డానిష్, అభయ్లుగా గుర్తించారు. విదేశాల్లో తిమింగలం వ్యర్ధాలను వైద్య ఉత్పత్తులు, పెర్ఫ్యూంల్లో వాడతారు. అంతర్జాతీయ మార్కెట్లో తిమింగలం ఉమ్మికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో దీన్ని ఫ్లోటింగ్ గోల్డ్గా పిలుస్తుంటారు. ఈజిప్టు వాసులు దీన్ని సెంట్లో వాడుతుండగా చైనీయులు దీన్ని డ్రాగన్ స్పిటిల్ సెంట్గా వ్యవహరిస్తుంటారు.