వరంగల్, ఫిబ్రవరి 14 : లక్ష్యాన్ని మించి రెట్టింపుగా లీడ్ బ్యాంక్ రుణాలు అందజేయడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా మొత్తం రుణాల పంపిణీ లక్ష్యం 2 వేల 744 కోట్లు కాగా, 4 వేల 36 కోట్ల రుణాలు ఇచ్చి లక్ష్యానికి మించి రెట్టింపు రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు, జిల్లా అధికారులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
వరంగల్ లీడ్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో డిజిటల్ బ్యాంకింగ్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు.
వ్యవసాయ, పరిశ్రమల రుణాలు అధికంగా ఉండటం అభినందనీయమన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, వెంటనే కొత్త రుణాలు మంజూరు చేయాలని సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాల గ్రౌండింగ్ వేగంగా చేయాలని చెప్పారు.
2019-20 ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వరంగల్ జిల్లా ప్రధాన మంత్రి అవార్డు కు ఎన్నిక కావాలని ఆకాంక్షించారు.
సెంట్రల్ బాంక్ అఫ్ ఇండియా, బాంక్ అఫ్ బరోడా, బాంక్ అఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బాంక్, ఇండియన్ ఓవర్సీస్ బాంక్, ప్రైవేటు బ్యాంకులలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు, కోటక్ మహేంద్ర బ్యాంకు, కర్ణాటక బ్యాంకులు వివిధ రుణాలలో ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నది. అలాంటి బ్యాంకుల పైన తగిన చర్యలు తీసుకొని పై అధికారులకు తెలియ చెయ్యాలన్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాల రుణ మంజూరులో రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా ప్రథమ స్థానం లో నిలిచిందని పేర్కొన్నారు. 14 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి వరకు RBI ఆర్థిక అక్షరాస్యత వారోత్సావాలలో భాగంగా.. అన్ని గ్రామీణ బ్యాంకు శాఖలలో గో డిజిటల్, గో సెక్యూర్ అనే నినాదం తో డిజిటల్ లావాదేవీలు, వాటి భద్రత గురించి అవగాహనా కార్యక్రమాలను నిర్వహించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో నే SC, ST, PMEGP ముద్ర, స్టాండ్ అప్ ఇండియా రులు అర్హులైన అందరికి అందజెయ్యాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ గిరిజన సంక్షేమానికి సంబంధించి పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, అధికారులు పాల్గొన్నారు.