ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. జూన్ 18 నుంచి జరిగే తుదిపోరులో భారత్-న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే. బయో సెక్యూర్ బబులో జరగనున్న టెస్టుకు
ప్రేక్షకులు హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో సౌతాంప్టన్ మ్యాచ్ జరిగే వేదిక వద్ద వరల్డ్క్లాస్ ప్లేయింగ్, ట్రైనింగ్ సౌకర్యాలు ఉండటంతో ఇరుజట్లు సన్నద్ధంకావడానికి అన్ని రకాలుగా ఉపయోగపడనుంది. బ్రిటన్ ప్రభుత్వం దశలవారీగా కొవిడ్-19 లాక్డౌన్ నిబంధనలను సడలించడం ప్రణాళిక ప్రకారం కొనసాగితే ఫైనల్ను చూడటానికి పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో పాటు ఐసీసీ భావిస్తోంది.