పట్నా : బిహార్లోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం పూర్నియా జిల్లాలో నలుగురు, సుపాల్లో ముగ్గురు, అరారియాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు బిహార్ సీఎం నితీశ్కుమార్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పిడుగులు పడకుండా ఉండేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ జారీ చేసిన సలహాలు పాటించాలని, కఠిన వాతావరణ పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు.