నాగర్కర్నూల్/అచ్చంపేట/ఉప్పునుంతల/ తి మ్మాజిపేట/రాజాపూర్, ఏప్రిల్ 12 : నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చిరు జల్లులు కురిశాయి. 5 గంటల సమయంలో వాతావరణం కాస్త చల్లబడి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గత రెండు వారాలుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చినట్లయ్యింది. పట్టణంలోని ప్రధాన రహదారిలో డ్రైనేజీలు ఉప్పొంగి వర్షపునీరు రోడ్లపై పారింది. కొన్ని చోట్లా డ్రైనేజీల నుంచి వర్షపు నీరు ఉబికి రావడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అదే విధంగా అచ్చంపేటలోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది. అలాగే ఉప్పునుంతల మండలం తాడూ రుకు చెందిన గుండెమోని శ్యామలమ్మ(34) శుక్రవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా అకస్మాతుగా ఈదురుగాలులు వీయడంతో చెట్టుకిందకి వెళ్లింది. ఆ చెట్టుపై పిడుగుపడడంతో అక్కడకక్కడే మృతి చెందింది. తిమ్మాజిపేట మండలంలోని మా రేపల్లి, నేరెళ్లపల్లి, అమ్మపల్లి గ్రామాల్లో శుక్రవారం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోగా కొంతమేర కొట్టుకుపోయింది. అమ్మపల్లిలో ఆరబోసిన మిర్చి కూడా తడిసిపోయింది. పంట అమ్ముకునే సమయంలో వర్షం తమను నట్టేట ముంచిందని రైతులు వాపోయారు. మహహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో కూడా శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది.