చెన్నై, ఫిబ్రవరి 14: ఎల్ఐసీ ఐపీవో ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం సెబీకి పంపడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ‘ఎన్నో ఏండ్లుగా సమర్థమంతమైన పనితీరుతో ఎల్ఐసీ సంస్థ కోట్లాది మంది నమ్మకాన్ని చూరగొన్నది. ప్రజలకు సామాజిక భద్రత కల్పించింది. కేంద్రం తీసుకొన్న నిర్ణయం ప్రజల కోసం కాదు. సంస్థ మంచి కోసం కాదు. సంస్థను అమ్మి డబ్బు చేసుకోవాలన్న ఆశ తప్ప మరేమీ లేదు’అన్నారు. ‘ఆదర్శవంతమైన ప్రభుత్వం ప్రజోపయోగ సంస్థలను నిర్మిస్తుందే తప్ప బీజేపీలా అమ్మి ఆనందపడదు’అని వ్యాఖ్యానించారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.