న్యూఢిల్లీ: తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ ఫోన్ల బిజినెస్ నుంచి వైదొలుగనున్నదా? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో తీవ్ర అస్థిరత నెలకొనడంతో మొబైల్ ఫోన్ల బిజినెస్ను మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వర్గాలను ఉటంకిస్తూ.. దక్షిణ కొరియా పత్రిక డోంగా ఇల్బో సోమవారం ఓ వార్తా కథనం ప్రచురించింది.
ఎల్జీ ఫోన్ల బిజినెస్ కోసం ఆ రెండు సంస్థలు ఆసక్తి
ఈ ఎల్జీ ఫోన్ల బిజినెస్ను కొనుగోలు చేయడానికి జర్మనీ ఆటో మేజర్ ఫోక్స్ వ్యాగన్ ఏజీ, వియత్నాం కంపెనీ విన్గ్రూప్ జెఎస్సీతో సహా రెండు బడా కంపెనీలు ఆసక్తి చూపాయి. ఇక ఇప్పుడు మరిన్ని కంపెనీల కోసం వేచి చూసే బదులు సాధ్యమైనంత త్వరగా ఫోన్ బిజినెస్కు ముగింపు పలకాలని ఎల్జీ భావిస్తున్నట్టు ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వర్గాల కథనం.
ఐదేండ్లలో ఎల్జీకి రూ.32,856 కోట్ల నష్టాలు
మరోవైపు స్మార్ట్ ఫోన్ పరిశ్రమ నుంచి వైదొలిగే యోచనలో ఉన్నామని వివరిస్తూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవో క్వాన్ బాంగ్ సియోక్ తమ ఉద్యోగులకు ఇప్పటికే లేఖ రాసినట్టు తెలిసింది. గత ఐదేండ్లలో ఎల్జీ దాదాపు 4.5 బిలియన్ డాలర్లు (రూ. 32,856 కోట్లు) మేర నష్టాలను చవి చూసింది. దీనివల్లే మొబైల్ బిజినెస్ నుంచి వైదొలగాలని ఎల్జీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. నష్టాల నుంచి గట్టేందుకు అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తున్నామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవో ప్రకటించిన కొద్ది రోజులకే ఈ విషయం వెలుగు చూడడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పుల ఊబిలో కుటుంబాలు.. తగ్గిన సేవింగ్స్!
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
చిరు-బాబీ సినిమా క్రేజీ అప్డేట్..!
అలాగేతైనే జూన్ నుంచి ఆభరణాల సేల్స్ !
టెస్లా మోడల్ త్రీతో టఫ్ ఫైట్.. వుల్లింగ్ హాంగ్గాంగ్ మినీ!