వీణవంక రూరల్ : పేద ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని, కోట్లాది రూపా యలతో పేదవారి కోసం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో బూత్కమిటీ, ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలకు ఆయన పలు సూచనలు చేశారు.
అనంతరం అయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాలన్నారు.ప్రతి ఓటరును కలుసు కోవాలన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించాలన్నారు గ్యాస్, పెట్రోల్, డిజీల్ రేట్లు పెంచడం, నిత్యవసరాల పెరగ డానికి కారణమైన బీజేపీ కుట్రలను వివరించాలన్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేస్తూ , ఉత్తరప్రదేశ్లో శాంతి యుతంగా నిరసనలు తెలుపుతున్నా రైతులను కారుతో చంపించిన విషయాలను రైతులకు తెలియ జెప్పాలన్నారు.
ధనబలంతో ఎన్నికలలో పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ డబ్బుతో ప్రజలను ప్రలోభపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలను కార్యకర్తలు గమనించాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త ప్రజలతో మమే కమై ప్రచారం చేసి భారీ మెజార్టీతో గెల్లు శ్రీనివాస్ యాదవును గెలిపించాలన్నారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.