సిద్దిపేట : రైతులతో చెలగాటమాడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఎండగడుదామని మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లోని చిన్నకోడూర్, పెద్ద కోడూర్, రాముని పట్ల గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణలోని యాసంగి పంట కొంటారా..కొనరా? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి..తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతా అని ప్రశ్నించారు. రైతులకు గుదిబండగా మారిన నల్ల చట్టాలు రద్దు రైతుల విజయమని,
సంవత్సరం కాలం పాటు రైతుల పోరాటంతో కేంద్రం దిగొచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
రైతుల పోరాట ఫలితమే నల్ల చట్టాలు రద్దు అని స్పష్టం చేశారు. నల్ల చట్టాలు అమలైతే వ్యవసాయం కార్పొరేట్ పాలయ్యేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నా చేపట్టారు. అన్నదాతలు ఆందోళనల పడొద్దు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
వానకాలం పంట మొత్తం తెలంగాణ ప్రభుత్వం కొంటుంది. వడ్లు కొనేందుకే ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. సాధ్యమైనంత త్వరగా వానకాలం ధాన్యం కొంటామని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్నారు. వర్షాల వల్ల వడ్లు ఎండక పోవడం వల్ల ధాన్యం కొనడంలో కొంత ఆలస్యం జరిగింది.
కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు సర్పంచ్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు రోజుకు రెండు గంటల పాటు కొనుగోలు కేంద్రాల వద్దే ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్ష పాత నిర్ణయాలు, ప్రోత్సాహంతో రైతులు పంటలు బాగా పండిస్తున్నారు.
యాసంగి నుంచి వడ్లు కొనం అనే కేంద్ర నిర్ణయం సరి కాదన్నారు.
కేంద్రం తన విధానాలను మార్చుకోవాలని సూచించారు. పారా బాయిల్డ్ రైస్ కొనం అనే కేంద్ర నిర్ణయం పుండు మీద కారం చల్లినట్లుంది. ఇది హేయమైన చర్యగా అభివర్ణించారు. దేశంలో పండిన ధాన్యాన్ని ఆఫ్రికా దేశాలు, ఇతర ప్రప్రంచ దేశాలకు ఎగుమతి చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన ఏబీ డివిలియర్స్
ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం : మంత్రి సత్యవతి