ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన వస్తువు ఏంటి? అంటే టక్కున చాలా మంది చెప్పే సమాధానం నిమ్మకాయలు. ప్రస్తుతం కేజీ నిమ్మకాయలు రూ.90 పైగా ధర పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు మార్కెట్లో నిమ్మకాయల దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఘజియాబాద్లో వెలుగు చూసింది. కొంత మంది దుండగులు బైకులపై మార్కెట్లోకి వచ్చారని, వారి వెనుకే ఒక మినీ ట్రక్కు కూడా వచ్చిందని స్థానికులు చెప్తున్నారు.
ఆ ట్రక్కు ఆగీ ఆగగానే.. బైక్పై వచ్చిన వాళ్లు కిందకు దిగి అక్కడే ఉన్న 12 బస్తాల నిమ్మకాయలు తీసుకొని ట్రక్కులో పడేశారు. ఆ వెంటనే ట్రక్కు వెనక్కు మళ్లింది. దుండగులు కూడా బైకులపై పారిపోయారు. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయిందని, దొంగిలించిన నిమ్మకాయల విలువ రూ.70వేలపైగానే ఉంటుందని తెలుస్తోంది. దీనిపై వ్యాపారులు స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. తాము ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.