హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులై బీజేపీ ఎంపీటీసీ ఈర్మ గంగామణి టీఆర్ఎస్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గం లక్కోర గ్రామానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శనివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వారి అనుచరులతో కలిసి హైదరాబాద్ లో గులాబీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగధర్, జెడ్పీటీసీ భారతి రాకేశ్ చంద్ర, ఎంపీపీ బీమా జమున, పార్టీ సీనియర్ నాయకులు రేగుళ్ల రాములు, సర్పంచ్ లు ఆకుల రాజేశ్వర్ అమినాపూర్, వంశీ లక్కోర, గంగారెడ్డి నడకూడా, రమేశ్ జానకం పేట్, నితీశ్ కొత్తపల్లి, సుధాకర్ సాహెబ్ పేట్, అమినాపూర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.