హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి.. గతంలో ఓ మహానుభావుడు చెప్పినట్లే తాను ఇవాళ ఇంట్లో గ్యాస్ సిలిండర్కు మొక్కి ఓటేసేందుకు బయలుదేరానని వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి కేటీఆర్ మహానుభావుడిగా ఉటంకించిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీయేనని జనంలో చర్చ జరుగుతున్నది.
ఎందుకంటే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నాడు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను దృష్టిలో పెట్టుకుని అప్పటి యూపీఏ సర్కారుకు కౌంటర్గా.. ఇంట్లో సిలిండర్కు మొక్కి వస్తున్నానని ప్రధాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని మాటలనే బీజేపీపై వ్యంగ్యాస్త్రంగా ప్రయోగించారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకున్న కొందరు.. తమ ఇండ్లలో గ్యాస్ సిలిండర్లకు పూజలు చేస్తున్నట్లుగా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి నెట్టింట వైరల్గా మారుతున్నాయి.