KTR | హైదరాబాద్ : మరికాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ క్రమంలో గులాబీ శ్రేణులతో తెలంగాణ భవన్ సందడిగా మారింది. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒకే కారులో కలిసి వచ్చారు. తెలంగాణ భవన్ వద్ద కారులో నుంచి దిగిన కేటీఆర్, హరీశ్రావుకు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్లు అందజేయనున్నారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా తాను చేపట్టే బస్సు యాత్ర రూట్మ్యాప్పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఒకే కారులో తెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు. pic.twitter.com/bEupKlnEqp
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2024