జూబ్లీహిల్స్ లోని నివాసంలో ప్రముఖ సినీ నటులు కృష్ణంరాజు (krishnam raju) భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రాధేశ్యామ్ (Radhe Shyam) డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ (Radha Krishna Kumar) కృష్ణంరాజు పార్థీవ దేహానికి నివాళులర్పించారు.
అనంతరం రాధాకృష్ణకుమార్ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. కృష్ణంరాజు నా నిర్మాత మాత్రమే కాదు..నా కుటుంబసభ్యులు కూడా. నా వ్యక్తిగత జీవితంలో కూడా కృష్ణంరాజు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇది చాలా భావోద్వేగపూరితమైన రోజు. ఆయన కుటుంబసభ్యులందరికీ మనోధైర్యం రావాలని కోరుకుంటున్నా. కృష్ణంరాజును లాస్ట్గా డైరెక్ట్ చేసే అదృష్ణం దొరికినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కృష్ణంరాజు ఎలా బతికారు..ఎలా రాజసంగా ఉన్నారో..అది అందరూ నేర్చుకోవాలన్నారు.
ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ తెలుగు వెర్షన్లో పరమహంస పాత్రలో నటించారు కృష్ణంరాజు. దీంతోపాటు అంతకుముందు ప్రభాస్తో కలిసి బిల్లా, రెబల్ సినిమాల్లో కూడా నటించారు.
Read Also : రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత