వీణవంక: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ఏ ఊరెళ్లినా మంగళహారతులిచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారు. సబ్బండ వర్గాలు సంక్షేమ సర్కారుకే జై కొడుతున్నాయి. వీణవంక మండలంలోని కొత్తపల్లి గ్రామ కుల సంఘాలన్నీ గులాబీ పార్టీకే మద్దతు ప్రకటించాయి. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమక్షంలో శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశాయి. కులవృత్తులకు జీవంపోసిన కేసీఆర్ వెంటే ఉంటామని కుల సంఘాల నాయకులు స్పష్టంచేశారు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టంచేశారు.