కొమురవెల్లి మల్లన్న క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఆదివారం కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. కల్యాణోత్సవం అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, సంక్రాంతి నుంచి ఉగాది వరకు 11 ఆదివారాల పాటు ఉత్సవాలను పాలక వర్గం నిర్వహించనున్నది. బ్రహ్మోత్సవాల్లో పట్నం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్నిగుండాలు తదితర కార్యక్రమాలు కీలకమైనవి. స్వామి వారి కల్యాణోత్సవ ఏర్పాట్ల విషయమై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నట్లు అంచనా వేశారు. 50వేల లడ్డూల తయారు చేయించారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.