బ్రిస్బేన్: ఇండో పాక్ సమరానికి హీట్ మొదలైంది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్కు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఇండియన్ క్రికెటర్ కోహ్లీ తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. మంగళవారం ఇద్దరు ప్లేయర్లు నెట్స్లో పక్కపక్కనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇద్దరు టాప్ బ్యాటర్లు ఒకే దగ్గర ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.
వరల్డ్ క్రికెట్లో కోహ్లీ, బాబర్కు మంచి గుర్తింపు ఉంది. ఆధునిక క్రికెట్లో కోహ్లీ టాప్ ప్లేయర్. అయితే బాబర్ కూడా రాణిస్తున్న తీరు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒకే దగ్గర బ్యాటింగ్ చేయడాన్ని అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు.
అన్ని ఫార్మాట్లలో ప్రస్తుతం బాబర్ బెస్ట్ అని ఇటీవల కోహ్లీ అన్నాడు. తన పట్ల గౌరవం ప్రదర్శిస్తున్న బాబర్ తీరు తనను ఆకర్షించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ తెలిపాడు. ఇక వరల్డ్కప్లో భాగంగా ఇవాళ ఇండియా,న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనున్నది.