తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్టీఆర్ తన పాలనలో మద్యనిషేధం విధిస్తే చంద్రబాబు ఊరూరా బెల్టుషాపులు పెట్టారని ఆరోపించారు. మీడియా సమావేశంలో కొడాలి నాని మట్లాడారు.
‘కరోనా కష్టకాలంలో అండగా ఉండాల్సిన చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారు. చంద్రబాబు మోసం, దగాను ప్రజలు చూశారు కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినందుకు దమ్ముంటే ప్రధాని నరేంద్రమోదీని బాబు ప్రశ్నించాలి. చంద్రబాబు పిచ్చివాగుడు తగ్గించుకుని బుద్ధిగా ఉండాలి..లేదంటే ప్రజలతోనే చంద్రబాబుకు బుద్ధి చెబుతామని’ నాని హెచ్చరించారు.